పుట:Ecchini-Kumari1919.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము .29

171


నిశ్శబ్దముగా నా చెట్టు వైపునకు వచ్చిరి. అదివఱకచ్చటనున్న పురుషుఁడు వారికెదురుగాఁ బోయి వారిని మఱికొంతదూరము గొనిపోయి యొక చోఁ గూర్చుండఁ బెట్టి యిట్లు ప్రసంగించెను.

పు: -- రాజకుమారులారా ! మీరు చెప్పినట్లు చేయ లేదు. భీముఁడు మీకు వాగ్దానము చేసినట్లు పదవుల నీయఁ డేమో యను ననుమాన మున్నదా యేమి? అట్లయిన నాతో రండు. ఇప్పుడే మీ కాబహుమానముల నిప్పిం చెదను.

రాజ: ఓయీ! మా కాసందియము లేదు. నేఁడు దొమ్మి యుద్ధమునఁ బృద్వీరాజును నఱక నెన్నోమాఱులు ప్రయత్నము చేసితిమి. కాని, కరుణరా జెల్లప్పుడు నాతని చెంత నే యుండెను. మా కవకాశము చిక్క లేదు. -పోనిండు, ఇప్పు డాపని చేయుఁడు

రాజ: - ఏమి చేయుమందువు ?

పు: నేటి యుద్ధమున సైన్యములు మిక్కిలి యలసి యుండుట చే గాఢముగా నిద్రించుచున్నవి. రాజుగూడ నేఁడు గాఢనిద్ర చెందియున్నాఁడు. కావున నతని గుడారమును బ్రవే శించి సాధ్యమైనచో నతనిని గట్టి తీసికొనిరండు, లేనిచో జంపుఁడు, ఇదియే మీరు చేయవలసిన కార్యము. ఇది నేఁడు కానిచో నది మీ కసాధ్యము. అతఁడు దుర్గమును ప్రవే శించినచో విశ్వప్రయత్నములు చేసియైనను మీ రతనిని జంపలేరు.

రాజ: అవును, నీవు చెప్పినది సత్యమే ! మే మీ రాత్రి నారాజు నెట్లయినను జంప వలెనని యోజించుచు నే యున్నాము. ఈసాయంసమయమున నాబూ సైనికు లిరువురు