పుట:Ecchini-Kumari1919.pdf/164

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము 27

163


చున్నది. ఇట నిచ్ఛినీకుమారియు, వకుళయుఁ గనఁబడ రేమి ? నీ వృత్తాంతము స్పష్టముగాఁ జెప్పు మని పల్క నాతఁడు చేతులు జోడించి యిట్లు చెప్పనారంభించెను.

'ఓ మహాప్రభూ ! 'నేను నిన్న దమయాజ్ఞను దాల్చి యనిహ లపురమునకుఁ బోవఁ బయన మై సం దేశహరుఁ డున్న తావునకుఁ బోయితిని. సం దేశహరుఁడును భుజించి కూర్చుండి యుండెను. రూపవతి యింకను నచ్చటకు రాలేదు. రాత్రి భుజించి సం దేశహరుఁడున్న 'తావునకు వచ్చెద' నని రూపవతి నిన్న సాయంసమయమున నే చెప్పుట చే నామెయింటికి నేను వెళ్ళ లేదు. ఆదూతయును, నేనును మాటాడుకొనుచుంటిమి. ఇంతలో వకుళ యచ్చటకు వచ్చి 'రాజకుమారా ! మీ రనిహలపురమునకుఁ బోవుదు రని తెలిసినది. అక్కడ మా సోదరుఁ డున్నాఁడు. అతని కొక వస్తువును బంపవలసియున్నది. మీరు నాయందు దయయుంచి యీవస్తువు నతనికిఁ జేర్పఁ బ్రార్థించుచున్నాను. నాకు మీ రీయపకార మొనర్తు రేని మీమే లెన్నఁడును మఱవను. అవి పెద్దబరువుగలవస్తువులు కావు. బంగారునగలు' అని మరి మరి ప్రార్థింప నే నందుల కంగీకరించితిని. ఈ చీకటిలోఁ గాదు, మీరు నామందిరము సకు దయ చేయుదురేని దీపపు వెలుఁగున మీ కప్పగిం చెదను. అట్లయిన మీకును నాకును గూడఁ జిక్కుండ' దని చెప్పఁగా నేను గొంచెము 'యోజించి యందేమితప్పున్నది, అని నిశ్చ యించి సందేశహరునితోఁ జెప్పి యామె వెంట నీ మందిరము