పుట:Ecchini-Kumari1919.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

ఇచ్చనీకుమారి


యచ్చట నెవ్వరును లేరు, భీమరాజు వకుళను బిల్చెను. కాని, యామెకూడ నక్కడ నున్నట్లు తోఁప లేదు. వా రిరు వురును గలసి కైలాసశిఖరమునకుఁ బోయియుందు రని మా సౌధమునకుఁ బోయెను, రచ్చటను గానఁబడ లేదు. అతఁడు మగిడి వెనుకటి భవనమునకు వచ్చెను. కాని, వారి జాడ లేమియుఁ గాన రాలేదు. అతని హృదయమున నాశ్చర్య తరంగము లెగయనారంభించెను. అతఁడు నిశ్చేష్టితుఁ డై ‘వీ రేమయి యుందురు ? ఎచ్చటికిఁ బోయియుందురు ? వకుళ కూడఁ గాన రా 'దేమి ? నేను వచ్చుచున్నట్లు విని వీ రీమం దిరములలో నెచ్చట నై న దాఁగియుండవచ్చునని యాలో చించి యొక్కొక్కమందిరమే వెదక నారంభించెను. అత డట్లు వెదకు చుండఁగా నొక గదిలోనుండి యెవ్వరో పిల్చు చున్నట్లు వినఁబడెను. తోడ నే యారాజు శబ్దముననుసరించి యామందిరము నొద్దకుఁ బోయెను. కాని, మాయింటి తలుపులు బంధించియుండెను. ఇంతలో మరల లోపలనుండి ధ్వని వచ్చినందున నెవ్వరో యున్నా రని నిశ్చయించి పైని బం ధింపఁబడిన బీగమును దీసి తలుపులు తెఱచెను. వెంట నే లోపలనుండి యొక పురుషుఁడు వచ్చెను. అతనికి జూడఁగా రాజున కాశ్చర్యము తలమునుక లయ్యెను. ఇంతలో నాపురు షుఁడు భయమున గడగడవడకుచు రాజు కాళ్ళ పై బడెను. రా జతనిఁ జూచి భూయాదా ! లెమ్ము, నీ విచ్చట కేల వచ్చితివి ? " ఇది యంతయు నింద్రజాలమువలెఁ గన్పట్టు