పుట:Ecchini-Kumari1919.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణ ము 27

159


భీ: నిన్న సం దేశహరుఁడు గాక మఱియెవ్వ రైన మనదుర్గములోనికి నచ్చిరా ?

భ" లేదు, మహాప్రభూ !

భీ: నిజము చెప్పుఁడు. లేనిచో మీతలల నజకిం చెదను.

భ: -మహా రాజా ! నిన్న సం దేశహరుఁడు తప్ప మ రెవ్వరును రాలేదు. తమ సెలవు లేని దే మే మెవ్వరిని విడువలేదు. లోనికిరానీయ లేదు. నిన్న రాత్రి నాల్గవ వానిని లోనికి బోనీయ మని మే మెంతో నిర్బంధించితిమి. "కాని,సం దేశహరుఁడు 'భూయాదుననుచరుని విడువక పోయినమాప్రభువుగా రిందుల కంగీకరించినా ' రని చెప్ప నూరకుం టీమి. ఆ పురుషులు మున్వురును ముందుగాఁ బోయిరి. తరువాత రూపవతి వచ్చి ద్వారము దాఁటిపోయినది, అంతకుఁ దప్ప మా కేమియును దెలియదు.

భీ: - యువతీ ! నాల్గవ వాడు వచ్చినట్లు నీ వెఱుఁగుదువా

రూ: మహారాజా ! నాకుఁ దెలియదు. నాతోరాలేదు. వచ్చుచున్నాఁడని కూడ నెఱుఁగను.

భీ: నీవు పోల్చుకో లేక పోతివి. కాని, మార్గమధ్యమున మిమ్ముఁగలసికొ నెనని చెప్పితి వే ? ఆతఁడు భూయాదుని ననుచరుఁ డే కావచ్చును !

రూ: వా రిరువురును సత్యముగా భూయాదుఁడు, నతనియనుచరుఁడును నైనచో నన్ను శత్రువులనుండి రక్షిం