ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇచ్చనీకుమారి
148
భ: — ఎక్కడనుండి వచ్చితివి ?
పు: -అనిహి లపురమునుండి.
భ: -ని న్నె వరు పంపిరి ?
పు: -మధుమంతుఁడు.
భ: -(ఆశ్చర్యముతో) మధుమంతుఁడా !
పు: -అవును, మధుమంతుఁడు
భ: _అతఁడు పరమారునికారాగృహమున నున్నా డని వినియున్నా మే!
పు : —అది నిశ్చయమే ! కాని, మాయోపాయము చేఁ దప్పించుకొనెను.
భ: - అట్లయిన నతఁ డిచ్చటికి రాక యనీహిలపురమున కేల పోయెను?
పు: -(విసివికొనుచు) మీకు సమాధానము చెప్పునప్ప టికి నాకు నోరు నొచ్చుచున్నది. అదంతయు మీ కేల ? 'నన్ను రాజసన్నిధికిఁ. బోనిండు.
భ: -ప్రభువుగారి సెల వైనఁ గాని నిన్ను లోనికి విడువ వలనుపడదు.
పు: అట్లయినఁ ద్వరగాఁ బోయి విన్న వింపుఁడు. ఆభటులలో నొకఁడు వేగముగా రాజును సమీపించి 'మహాప్రభూ ! అనిహలపు రమునుండి ' యొక భటుఁడు వచ్చి నాఁడు. మధుమంతుఁ డేదో యుత్త రమిచ్చి పంపె నఁట.