పుట:Ecchini-Kumari1919.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము 25

141


లేదు: ఆబూ రాజునకు ఢిల్లీ రాజు సహాయుఁడై వచ్చియున్నం దున భీమరాజు మిగుల జాగరూకుఁడై దురములో నుండియే పోరుసల్ప నిశ్చయించి శత్రువులు త మమెదిరించినప్పుడే యుద్ధము చేయుఁడని సైనికుల కాజ్ఞాపించుటచే నాఘూర్జరు లాయుధపాణులై కంటికి తెప్పవలె నాదుర్గమును గాచు కాని, యుద్ధ మారంభింప లేదు. ఇట్లా మూఁడు సై న్యములును నానావిధ యుద్ధపరికరములను దాల్చి వర్ష కాల మున నాకసముల బారులుదీర్చి స్వకీయమగు నీలకాంతులచే జగము నంధ కారముగ నొనర్చుచు, నడుము నడుమ మెఱపు లచేఁ చూపఱకు మిరుమిట్లు గొలుపుచు వర్ష ప్రారంభ కారి యగుచల్ల గాలి కెదురుచూచుచున్న మేఘబృందములవ లె మిగుల గంభీరము లై రాజాజ్ఞ కెదురుచూచుచుండెను. శత్రు సై న్యములు తనదుర్గమును సమీపించి విడిసియున్నను ముట్టడి ప్రారంభింపక శిబిరములం దట్లేలయుండి పోయినవో యని యాలోచించియు సరియగు కారణ మరయ లేక భీముఁడు సై న్యములు దుర్గమును ముట్టడించుటకుఁ బూర్వమే గుజ రాతునుండి మఱికొంత సైన్యమును రప్పించుకొన నిశ్చ యించి యచ్చట కాజ్ఞాపత్రమును బం పెను. తనయనుమతి లేకుండఁ బై నున్న వారిని లోనికిఁగాని, లోని వారిని బైకిఁగాని పోనీయరాదని ద్వార పాలకులను గఠినముగా శాసించి దుర్గ ద్వారములు మూయించి భీమ దేవుఁడు మిగుల జాగ రూకుఁడై యుండెను.