పుట:Ecchini-Kumari1919.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

ఇచ్చ నీ కు మారి


చంద్రావతీ పురమును రాజధానిగాఁ జేసికొని యాబూ రాజ్యము నేలుచుండిరి. దాని కెల్లపుడును శత్రువుల రాపిడి సంభవించు చుండుటచే వారలు దానిని విడిచి శత్రువుల క భేద్యమగు నీకొండ దుర్గమును రాజధానిగాఁ జేసికొని తమ రాజ్యమును బాలించుచుండిరి.

మన కథాకాలమున జైతపరమారుఁ డను రాజపుంగ వుఁడు దానిఁ బాలించుచుండెను. అతఁడు మిగుల ధైర్య సాహసములు గలవాఁడు; వివేక శాలి; నిజమతమునం దెక్కుడు పట్టుదల గలవాఁడు. అతఁడు ధర్మయుక్త ముగా ధరణిఁ బాలించి తొంటిరాజులకంటె నధికమగు కీ ర్తి గాం చెను. అతని కొక కుమారుఁడును నొక కుమార్తి యును గలరు. కుమారుని పేరు చళుక సింహుఁడు. కూతు పేరు ఇచ్చినీ కుమారి. ఆమె రూపలావణ్యములం దసమానురాలని యా కాలమున వాసికెక్కినది. ఆయందమునకు వివేకమును, సుగుణసంపదయు, విద్యయుఁ దోడ్పడి వన్నె పెట్టుచుండెను. ఆమె తనయన్న యగుచళుక సింహునితో పాటు విలువిద్య గూడ సభ్యసించెను. వింట బాణము సంధించి లక్ష్యమును భేదించుటయం దామెకుఁ గుదిరిన నేర్పు మిక్కిలి కొనియాడ దగినది. పర్వెత్తిపోవుమృగములను గుఱిచూచి కొట్టి చంపఁ గలదు. ఆమె యొక్కొకమారన్న గారితో వేఁట కరుగు నభ్యాసముగూడఁ గలదు. మిసమిసలాడుతూ వనవిలాసము లచేఁ డులకించు నా మె దివ్యరూపము యువజన హృదయము