పుట:Ecchini-Kumari1919.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము -22

125

వకు: - రాజేంద్రా ! వానిని జూచినంతనే గడగడ వడకు మావంటి భీరువుల కంతశక్తి యెక్కడ ?

భీమ:: ఓసీ ! వెట్టి దానా ! నీవు వాస్త వముగా నట్టి 'దానవే కావచ్చును. కాని, యా రాకుమారి యట్టిది కాదు. ఇట్టి సైన్యముల నిముసమాత్రమున నుఱుమాడ శక్తి గలది. విలువిద్య చే భీమ దేవునంత వాని నే వశపఱచుకొన్న యీ యువతి యెంతకు సమర్థురాలు కాదు !

అది విని వకుళ యూరకుండెను. ఇచ్ఛినీకునూరి తనలో ' ఈ దురాత్ముఁడు మంచిచూటలాడి నన్నుఁ బొంగించి లో బఱుచుకొనఁ జూచుచున్నాఁడు. ఇచ్ఛినీకుమారి వీనిముఖ స్తుతులకుఁ బొంగిపోవునది కాదు. వీనిమంచి మాటలకు లొంగు నది కాదు. వీని భీకరవచనములకు జంకునది కాదు' అని తలం చుచు నూరకుండెను.

అపుడు భీముఁ డిచ్ఛినీకుమారినిఁ జూచి “రాజపుత్రీ ! చూడుము. నీతండ్రి సైన్యమునకును, నా సైన్యమునకును నెంత వార గలదో చూడుము, యుద్ధమునకుఁ దలపడినచో దాని జయించుట నా కెంతపని ! అయినను నాకుఁ బాణప్రియు రాలవగు నీమనస్సు కలతఁ జెందు నేమో" యని వెనుదీయు చున్నాను' అని పలికెను.

తనవచనములు విని యాయువతి తనతండ్రి సైన్యము లను గాపాడవలె నని పార్థించుననియు, నామె ప్రార్థించు నట్లు చేసి తన్మూలముగా నా మె దయను సంపాదించుకొన