పుట:Ecchini-Kumari1919.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము ..22

123


మహా వేగముతో నెడ తెగని ప్రయాణము లొనర్చి నిరాటంక ముగా మధుమంతమును సమీపించెను. కాని, వానికష్టము నకుఁ దగినంత ఫలమును బొంద లేదు. పరమారుఁ డనుకొను న టచ్చట సామాన్య పై న్యములు లేవు. భీమ దేవుఁ డంతకు మున్నే చతురంగ సై న్యములతో వచ్చి యాపురమును రక్షించుచుండెను. మహాసముద్రమువలే ముందుఁగన్పట్టు నాసై న్యమును జూచి పరమారుఁడు చేయునది లేక తనబల ముల నక్కడ విడియిం చెను, మధుమంతము నంటి పెట్టుకొని మూర్జర సైన్యమును, దానికి సమీపముగా నాబూగడ సైన్య మును నిలిచి యొక దాని నొకటి చూచుకొనుచు వర్షకాల మందు జలపూర్ణము లగు కలమ క్షేత్రములన లెఁ దొణఁకు లాడుచున్నను దమయధిపతులయాజ్ఞలు గట్లన లె నడ్డుట చే నెక్కడి వక్కడ నుండిపోయిన వే కాని యుద్ధమునకు దలపడ లేదు. ఇసుము పాతరవ లె: దుగని మూర్జర సైన్యముతో బోరాడిన చోఁ బ్రాణనాశముతప్పవేౠ లాభము గలుగదని పరమారుఁ డెఱుఁగును. అందుచేఁ గుపితహృతయుఁ డైనను, భీమ దేవునితోఁగూడ నతని సై న్యముల నొక్క ముద్దఁ జేసికొని యొక్క మా ఱె మింగవలె నని కోరుచున్నను యుద్ధ మొనర్పం దన వారి నాజ్ఞాపింప లేదు, పరమారుని సైన్యము నవలీల జయింపఁగల నను ధైర్యమున్నను భీమ దేవుఁ డందులకుఁ బ్రయత్నింప లేదు. కాఁగల మామగా రగు పరమారునిఁ దాను బరాభవించినచోఁ దన