పుట:Ecchini-Kumari1919.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

122

ఇచ్చిని కుమారి


ఇందువిషయమై మీరుగూడ యోజించి కార్యనిశ్చయము చేయుఁ" డని పల్కి యూరకుండెను.

పరమారుఁ, డీశ్వర భట్టు తనకొనర్చినయుప కారమున కానందించి యతనిఁ జూచి 'ఓ మహానుభావా! నీ వొనర్చిన ఘన కార్యమునకు 'మెచ్చితిని.నీయుప కార మెప్పటికిని మజవను. ప్రాణపద మగు నాకూఁతువృత్తాంతమును దెచ్చి నాజీవములను నిల్పితివి, ఆఘన కార్యమునకు బహుమతిగా నీము త్యాలహారము నిచ్చుచున్నాను. స్వీకరింపుము' అని పల్కి యీశ్వర భట్టు మెడ నలంక రించి యతనిని సంతసింపఁ జేసెను.

అనంతరము రాజు మధుమంతునిఁ గారాగారమున నుంప నాజ్ఞాపించి మంత్రులం జూచి 'ఈశ్వర భట్టు చెప్పినది యు క్తమని నాకుఁ దోఁచుచున్నది. భీముఁ డచ్చటికి రాక మున్నే మనము సైన్యములతోఁ బోయి దానిని ముట్టడింప వలయును. అందులకు మీ యభిప్రాయము తెలుపు' డని వారంద జందుల కేకగ్రీవముగా నంగీకరించిరి. జైతు డామఱునాఁడే దండుతో మధుమంతమున కరిగెను.

ఇరు వ ది రేరెం డ వ ప్ర క ర ణ ము

లక్ష్య భేద న ము

ఉన్నత ప్రదేశమునుండి పల్లమునళుఁ బాఱునదీప్రవా హమువలేఁ బరమారుని సైన్యము లాబూగడమును వెడలి'. .