పుట:Ecchini-Kumari1919.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 20

121


ఈ మధుమంతుని నిచ్చటికిఁ బంపవలె నని నామిత్రునితో 'జెప్పి రాజకుమారిని జూచి రావలయునని మధుమంతము నకుఁ బోయి బిచ్చగాని వేషమును దాల్చి యాదుర్గములోనికి బోయి యిచ్ఛినికి మిక్కిలి ప్రియమగు నొక శ్లోకమును జదువనారంభించితిని. లోపలనున్న యామె సంగీతము చే హరిణకిశోరమువలె నా శ్లోకము చే నాకర్షింపఁబడి నన్ను గుఱుతించి యచ్చటనున్న చెలికత్తెల కనుమానము తట్టకుండు సట్లు మాటాడి నాకు దీని నిచ్చినది. . ఆకుమారి నాకు దీని నానవాలుగా నిచ్చిన దని నేను గ్రహించితిని. “రాజేంద్రా! ఇచ్ఛినీకుమారిని నేను జూచితిని.గృశించి యున్నది. ఆమె దుర్గశ \చూడ నాకు మిక్కిలి దుఃఖమువొడమెను. కావున, నామెను గొనివచ్చుటకుఁ దగిన ప్రయ త్నముచేయవలెను. నాకొక యుపాయము తట్టు చున్నది. అమర సింహుఁ డిచ్ఛినిని మధుమంతమునఁ బ్రవే శింపఁ జేసి - యాశుభ వార్తను భీమున కుత్తర ముఖమునఁ దెలుపుచు నేదో పని సాధించుటకుఁ బోయియున్నాఁడు, ఆయుత్తరమును గొనిపోవుచున్న వీనిని మనము బంధించి తిమి. కావున, భీముఁ డిచ్ఛినీకుమారి మధుమంతమునకు వచ్చినట్లెఱుఁగఁడు. మధుమంతమున నిపుడు సామాన్య సైన్యము లున్నవి. మనము వెంటనే సై న్యసమేతులమై పోయి యాదుర్గమును ముట్టడించినచో సులభముగా నే కార్యము నేఱ వేఱునని తోచుచున్నది. భీముఁ డచ్చటికి రాకము న్నె మన మచటికీ బోవుట ముఖ్య కార్యము,