పుట:Ecchini-Kumari1919.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము

105



యచ్చెరు వొందసాగిరి. నాఁటినుండియు నారాజపుత్రి దయను సంపాదించి యేదయినను బహుమానము పుచ్చుకొనవలెనని తలంచి నకుళ యను పరిచారిక తక్కినవారికంటె మిక్కిలి యడఁకువతో నర్తించుచు నాయిచ్చిని యభిప్రాయము ననుసరించి నడచుచు నామెకుఁ దగినయుపచారములు చేయ నారంభించెను, అందులకు రాజకుమారి యానందించుచు 'దానిపై నెక్కుడుదయ చూపుచుండెను,

పరి దొమ్మి ద ప ప క ర ణ ము

ఇచ్చినీ భీమ దేవుల సంవాదము

మధువంతమునఁ గైలాసశిఖర మను నొక మహా సౌధము గలదు, ఉన్నతమైన సుధాకాంతుల చే సతి ధవళమై కైలాసశిఖరమువలె నుండుట చేతనే దానికా పేరు గలిగెను. దానియు పరిభాగమున నిచ్ఛినీకుమారి వకుళతోఁగూడ విహ రెంచుచుండెను. ఆ పరిచారిక యచటికీ దూరముగాఁ గనఁబడు చున్న పల్లెలను, బట్టణములను, నదులను, గోండలను జూపు చుండ నిచ్ఛినియుఁ దదేకాగ్రచిత్త ముళోఁ జూచుచుండెను. అంతట నా సౌధమున నెవరో యెక్కి వచ్చుచున్న ట్లడుగుల చప్పుడు వినఁబడఁగా నాయువతులిరువురును శబ్దము వినవచ్చు చున్న వైపు దిరిగి చూచిరి. మొదట రూపవతియు దానిననుస రించి భీమ దేవుఁడును వచ్చుచుండిరి. ఇచ్చిని భీము నిదివటి