పుట:Ecchini-Kumari1919.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర క ర ణ ము 18

99


యున్న యాబాలిక నుంచుకొని రహస్యముగా మధుమంతము నకు గొనినచ్చి యాదిన్య సౌధమున విడియించెను. అభయ సింగును వెంటఁ బెట్టుకొనిపోయిన బైరాగి మరికొంత సేపటి కమరసింహుండె వచ్చి యాదుర్గమును జేరెను. మఱునాఁ డుదయ కాలమున నిచ్ఛినీకుమారి మేల్కొని సలుగడలం జూచెను. ఎటుచూచినను క్రొత్త వస్తువు లే చూ పట్టెను. ఆమె యాశ్చర్యముచే మ్రానుప డెను. అది స్వప్న మేమో యని భావింపఁదొడఁగెను. కాని, కొంత సేపటి కాసం దేహము తీరెను. ఆమె నలువంకలను బరిశీలించి త న్నె స్వరో మోసపుచ్చి యీ నూతనపురమునకుఁ గొనివచ్చి యుందురని నిశ్చయించుకొనెను. ఆమందిరమును విడిచి నాలు గడుగులు నడచి యీవలకు రాఁగా నే రూపవతి ప్రత్యక్ష మయ్యెను. దానిని జూడఁగా నే యా రాజకుమారికిఁ గొంత ధైర్యము గల్లెను. రూపవతియే మోసపుచ్చి త న్నచ్చటికి గొనిన చ్చెనని యామె యెఱుఁగదు. చతురు రాలగు రూపనతి సాయ ముండిన చో నా పదవచ్చినను దప్పించుకొనవచ్చునని యూహించుకొనుచు నిచ్ఛిని దాని చెంతకు వచ్చి యిట్లు ప్రశ్నించెను.

ఇచ్ఛి: — రూపవతీ ! మన మిప్పు డెచ్చట నున్నాము?

రూ: -అమ్మా ! ఇ దేదియో మాయగాఁ నున్నది ! ఆపాడు బై రాగిముండ కొడుకు మనల మోసపుచ్చి యిచ్చ