పుట:Dvipada-Bagavathamu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ద్విపదభాగవతము

జనుల నెత్తుక రాత్రి చని ద్వారవతిని
దనరు మందిరములఁ దగుభంగి నునిచి
మరలి సీరయుఁ దాను మధుర కేతెంచి

కృష్ణుఁ డొంటరిగా కాలయవనునికడకుఁ జనుట


హరి నిరాయుధలీల నట కాలయవను
కడకు నిర్భయత నొక్కరుఁడు నేతేరఁ
గడుసోద్యమంది యక్కమలాక్షు నెఱిఁగి
యడరి దిగ్గన లేచి యటఁ గాలయవనుఁ
డడనయ్యె నదె పట్టుడని వెంటఁదగుల
హరి వానిఁ గడపట నందంద పరువ
వెరవేది వాఁడును వెనుకొని పలికె
“వీరధర్మము మాని వెలివారు నగఁగ
నీరీతిఁ బారుట యిది బంటుతనమె?
పగవాఁడు నీవెంటఁ బడ సిగ్గుమాలి
తెగిపారఁ బ్రాణంబు తీపటె కృష్ణ?610
పోవకు పోయినఁ బొరిగొందు” ననిన

శ్రీకృష్ణుఁడు వెంటఁ దఱుముచున్న కాలయవనుఁడు చూచుచుండగా నొకకొండగుహను బ్రవేసించుట


నావిష్ణుఁ డదరి మహాద్రిగహ్వరముఁ
జొచ్చిన వాఁడును జొచ్చి తోడ్తోన
నచ్చోట సుఖసుప్తుఁడగు పుణ్యుఁ గాంచి
హరి యదృశ్యుండైన యట నిద్రనొందు
నరుఁ గాంచి యతఁడు నున్నతప్రీతిఁ బలికె