పుట:Dvipada-Bagavathamu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

55

జరాసంధకాలయవనుల దాడినిఁ జూచి శ్రీకృష్ణుఁడు క్రొత్తపట్టణమును నిర్మించుట


హరి రాముఁడును దాను నటు విచారించి
“పరఁగ యాదవుల కాపద వచ్చెఁ జూడు
డిదె వచ్చె బలవంతుఁ డీకాలయవనుఁ
డదె జరాసంధుఁడు నటవంక వచ్చె
నేది కార్యము? మన కీప్రోలనుండ
రాదు; నాశమునొందుఁ బ్రజయిందు నున్న
ననిపల్కి; గోవిందుఁ డబ్ధిఁ బ్రార్థించి
చనుదెంచి దేవతాశైలంబుపొంతఁ
గర మొప్ప వ్విశ్వకర్మ రావించి
పురము నిర్మింపఁ బంపుటయు నతండు
బహువప్రగోపురభర్మహర్మ్యముల
బహురత్నకనకవిభ్రమచిత్రితముల
తతి చెలంగగను ద్వాదశయోజనములఁ
జతురశ్రమంబుగా సౌభాగ్యలీల
వలను మీరఁగ ద్వారవతి యనుపేరఁ
గలిగింప నప్పురిఁ గని సంతసిల్లి600
తనరారఁ బారిజాతము సుధర్మమును
యనిమిషేంద్రుఁడు శౌరి వీథిఁ బుత్తెంచె
ధనదునిఁ దలఁచిన దన మహాద్రవ్య
మెనిమిది కోశంబు లిచ్చి పుత్తెంచె.
అధికయోగారూఢుఁడగు ముకుందుండు
మధురలోపలఁ [1]దన్ను మఱచి నిద్రించు

  1. నాద