పుట:Dvipada-Bagavathamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

53

నేమి నిర్ఘోషంబు నెరపంగ రథము
కామపాలుని తేరుఁ గదియించి పలికె.
“పిన్నవాఁడవు మున్ను భీమసంగ్రామ
మెన్నఁడైనను జూచి యెఱుఁగుదే(నీవు)?
పటుశత్రువన దావపావకుండనఁగ
నిట జరాసంధుని నెఱుఁగవే తొల్లి?
తలఁ గోసివేసెదఁ దరలక నిలువు
కలఁచి నాయల్లునిఁ గ్రక్కింతుననుచు;”
యమ్ములు వఱగించ యందంద సీరి
యెమ్ములుఁ గీలింప నెంతయు నలిగి
యేమిటి కీరజ్జలిటు ప్రేలెదనుచు
నామహాబలశాలి యరదంబు డిగ్గి
వానకుఁ దలవంచి వచ్చు గోరాజు
పూనికె వానియమ్ములు లెక్కఁగొనక
ముసలంబుఁ గొని హయంబులఁ జావ మోది
యెసఁగి సూతుని తల నిల డొల్లవ్రేసి
గదిసి జరాసంధు కాయంబు మోముఁ
జదియంగ నడిచి నిశ్చలితుగాఁ జేసి
పెడగేలుఁ గట్టి యాభీమవిక్రముఁడు
పెళపెళ నార్చినఁ బేర్చి సైన్యములు580
పటహళంఖారావపటుసింహనాద
చటులఘోషముల దిక్సంధులు పగిలె.

కట్టువడిన జరాసంధుని శ్రీకృష్ణుడు దయచే విదలి పుచ్చుట


కడువేగ హరి వచ్చి కరుణమై నతని