పుట:Dvipada-Bagavathamu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

49

కొని దివ్యరథముపైఁ గొమరారె సీరి,
హరి శంఖచక్రగదాదిశార్ఞముల
ధరియించి కరమొప్పఁ దనరథం బెక్కి
మేరుశిఖరముల మెఱుఁగులతోడ
సారమై బహువిధచ్ఛాయలఁ గలిగి
[1]ధారాధరము బంగిఁ దనరారెఁ జూడ;
నాలోన వృష్టిభోజాంధకాధిపులు
నేలఁబట్టవియించి నిష్టురోక్తులను
గరిఘటాబృంహితఘననేమిరావ
తురగఘోషితరావతూర్యముల్ మ్రోయఁ
బురికొని వెడలి యార్పులు నింగి ముట్టఁ
బరవసంబునఁ దాఁకెఁ బరగ సైన్యములు;
నేలయీనిన భంగి నిగిడి “యే మేము
చాలుదుమనివచ్చు" సైనికోత్తముల530
యురుపాదహతులను నోర్వక దివికి
నరిగెనో యన ధూళి యర్కునిఁ గప్పె;
నప్పుడు గోవిందుఁ డఖలసైనికులు
నుప్పొంగ నిజశంఖ మొత్తె, నొత్తుటయుఁ
బెడరి దిగ్గజములు, భీతిల్లె దిశలు,
కదలె కులాద్రులు, కలఁగె వారిధులు
వంగె మేరువు, ధరావలయంబు దిరిగె,
క్రుంగెఁ గచ్ఛపరాజు, ఘూర్ణిల్లె నభము,
కెరలి సేనలు పెల్లగిలి పారఁజూచె
శరపరంపరలు భీషణముగా నిగిడి

  1. ఒకేపాదము కన్పడుచున్నది.