| | సారమతి నతులవాక్య | |
పై పద్యముల వలన నీ కవి తిక్కనసోమయాజుల మనుమరాలి మనుమఁడనియు, గోదావరి మండలములోని పెద్దమడికి నివాసుఁడనియు, స్పష్టమగుచున్నది. ఈ విధముగాఁ దర్కించి చూచినపుడు మడికి సింగనార్యుఁడు 15వ శతాబ్దపు కవియని నిర్ణయించుటలో సందేహమునకుఁ దావు లేదు.
ప్రస్తుత పరిష్కరణమైన భాగవత దశమస్కంధము మడికి సింగనార్యుని కృతమా కాదా యనునది చర్చింప వలసియున్నది. అనేక ప్రబల నిదర్శనములపై నేను ద్విపద బద్ధమైన యీ భాగవత దశమస్కంధము మడికి సింగనార్య కృతమను నిశ్చితాభిప్రాయమునకు వచ్చితిని. కాండాంతద్విపదలను గమనింపుడు.
| ద్విపద. | “అని ఇట్లు నయనిర్జరామాత్యుపేర | |