పుట:Dvipada-Bagavathamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

v

సారమతి నతులవాక్య
శ్రీరచనాచతురమతిని సింగమహ్వయున్.

పై పద్యముల వలన నీ కవి తిక్కనసోమయాజుల మనుమరాలి మనుమఁడనియు, గోదావరి మండలములోని పెద్దమడికి నివాసుఁడనియు, స్పష్టమగుచున్నది. ఈ విధముగాఁ దర్కించి చూచినపుడు మడికి సింగనార్యుఁడు 15వ శతాబ్దపు కవియని నిర్ణయించుటలో సందేహమునకుఁ దావు లేదు.

ప్రస్తుత పరిష్కరణమైన భాగవత దశమస్కంధము మడికి సింగనార్యుని కృతమా కాదా యనునది చర్చింప వలసియున్నది. అనేక ప్రబల నిదర్శనములపై నేను ద్విపద బద్ధమైన యీ భాగవత దశమ స్కంధము మడికి సింగనార్య కృతమను నిశ్చితాభిప్రాయమునకు వచ్చితిని. కాండాంతద్విపదలను గమనింపుడు.

ద్విపద.
“అని ఇట్లు నయనిర్జరామాత్యుపేర
 ధన ధాన్య మణిమయ దానాఢ్యు పేర
 భూభరణక్షమ భుజసారుపేర
 నౌభళ మంత్రి కందామాత్యు పేరఁ
 గోరి భరద్వాజ గోత్ర సంజాతుఁ
 డారూఢ మతి నయ్యలార్య నందనుఁడు
 శృంగార రసకళా శ్రితివచోధనుఁడు
 సింగయామాత్యుఁడు చెలువగ్గలింప
 సలలితరసభావ శబ్దగుంభనల
 మహానీయమగు దశమస్కంధ సరణి
 విహితలీలలనొప్పు విష్ణుచరిత్ర