పుట:Dvipada-Bagavathamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

45

వగచుచునుండు నావసుదేవసుతుఁడు;
తనపుత్రులట్ల తాఁదలఁచి నీసుతుల
యనుఁగొప్ప బ్రోచునా యాంబికేయుండు?
దుర్యోధనాదిపుత్రులు వీరితోడఁ
గ్రౌర్యంబు లెడబాసి కలసియుండుదురె?
పండితసామంతబంధులు మిమ్ముఁ
బాండుఁ గొల్చినయట్ల భజియింతురమ్మ?”

అక్రూరునితోఁ గుంతి తనకష్టములను జెప్పుట


అని పల్కుటయుఁ గొంతి యక్రూరుఁ జూచి
యనుకంపతోడ నిట్లని యల్లఁ బలికె
“ఆరాజు సముఁడౌను యతని నందనులు
క్రూరులు ప్రజ వీరిఁ గొలువంగనీరు.
అదిగాక బిడ్డల నందఱిఁద్రోచి
మదిఁబూని బంధించి మడుగులోపలను
గరళంబు పెట్టించి ఘనసర్పవితతి
పరువడి గరపింపఁ బ్రాణగండములు
దలఁచిన వీరును తప్పుగాఁ గొనరు
వలదని సుతులను వారింపఁ డతఁడు
దైవంబుకతన నింతలు బారులడఁగె
గోవిందుతోడ మాకుశలంబుఁ జెప్పు490
పుట్టిన యిల్లునుఁ బొరిఁజొచ్చినిల్లు
నిట్టిదె మాభాగ్య మేమంచు వగవ
దేవకి కడుపున దేవేంద్రవంద్యు
డావిష్ణుఁ డుదయించునని పెద్ద లాడఁ