పుట:Dvipada-Bagavathamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

ద్విపదభాగవతము

పులుకలు మైఁగ్రమ్మఁ బుండరీకాక్ష!
జలశాయ! గోవింద! శౌరి! శ్రీకృష్ణ!470
అని భక్తిఁ గీర్తించి యతనిఁ దోడ్కొనుచుఁ
జనుదెంచి పాండుని సతి యింటికడకు

అక్రూరుఁడు కుంతీదేవిని గాంచి కుశలప్రశ్నఁ గావించుట


నరుదేరఁ గొంతియు నక్రూరుఁ జూచి
కరచకితాస్యయై కన్నీరు దొరుగ
నెలుఁగెత్తి యేడ్చుచు నెడయైన వగలఁ
బలుమారు పలవింపఁ పడతి నూరార్చి
ధర్మనందనవృకోదరపార్థకవల
నర్మిలి కౌఁగిట నందందఁ జేర్చి
యందఱ మణిభూషణాళిఁ బూజించి
కాందినీసూనుఁ డాకమలాక్షి కనియె.
"అమ్మ మీమేనల్లుఁ డమరేంద్రవంద్యుఁ
డమ్ముకుందుఁడు మిమ్ము నరయఁ బుత్తెంచె.
పాండుమహీపతి పరలోక మరుగ
నిండిన వగలతో నీవుఁ బుత్రులను
యిచ్చటి కరుదెంచి రెఱిఁగి రమ్మనిన
వచ్చితి, నచ్చట వసుదేవుఁడొంటి
మనవారలెల్ల నెమ్మది నున్నవారు
ఘనపాపకర్ముని గంసునిఁ ద్రుంచి
ధరణిరాజ్యము వాని తండ్రికి నిచ్చి
హరి యెల్లశత్రుల నణఁచుచున్నాఁడు;480
తగిన మీకిట్టిదుర్దశ వొందు టెఱిఁగి