పుట:Dvipada-Bagavathamu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

39

ఉద్ధవుఁడు గోపికల మాటలను విని వారి పుణ్యమునకై మెచ్చుకొనుట


తనరారఁ జెప్ప నుద్ధవుఁడు చిత్తమున;
“వీరు దన్యాత్ములు వీరు పావనులు
వీరికి శౌరికి వేరు లేదెందు
వీరలఁ గనుఁగొంట విష్ణునిఁగంట
వీరికై హరివచ్చి వ్రేపల్లెఁ బెరిగె
నిన్ని చందంబుల నీమందవారి
మన్నించి కృష్ణుడు మమళ వాపించి420
నామీఁదఁ గృపఁగల్గి నన్ను మన్నించి
యీమహాకార్యార్థ మిటు వచ్చె శౌరి
యిది జన్మఫలసార మిది దోషమార
మిదిగదా సౌభాగ్య మిదిగదా యోగ్య"
మని సంతసిల్లుచు, నతివలుఁ దాను
జనుదెంచి ప్రేమ మజ్జనభోజనములు
సలిపి, గోపికలు నిచ్చలు మానసములఁ
గలిసి చెప్పక విష్ణుకథ లెల్ల వినుచు;
నందయశోద లున్నతిఁ గారవింప
మందవారెల్ల సమ్మతి విందులిడఁగ
నొకకొన్ని నెలలుండి యుద్ధవుఁడంత;

ఉద్ధవుఁడు మధురానగరికి మరలుట


యకలంకగతి వార లనుపంగఁ గదలి
మధురకుఁ జనుదెంచి మాధవు గాంచి