పుట:Dvipada-Bagavathamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

33

కడపటఁ దనుఁ జూడఁ గానక యేముఁ
బొడవడఁ బొక్కకఁబోలు రాఁడాయె;
నతని విక్రమలీల లాత్మలయందు
సతతంబు దలఁచి నిశ్చలవృత్తు లగుచు350
వ్రేపల్లె విహరించు వెలఁదులు పతులు
నాపూర్ణధన్యులు యగుదు రేప్రొద్దు
మాయింటఁబెరిగిన మందెమేలమున
నాయన్నదమ్ముల నాత్మజు లనుచుఁ
దలఁతుము దేవతాతనువులు గాక
యిలనిట్టి విక్రమం బెవరికి గలదు?”

ఉద్ధవుఁడు శ్రీకృష్ణుని గుఱించి యశోదానందులకుఁ జెప్పుట


అనిపల్కి నందుండు నయ్యశోదయును
మనమున హర్షించి మ్రాన్పడి మేను
గరుపార హర్షాశ్రుకణములు దొరుగఁ
బొరిఁబొరిఁ జిత్రరూపులుభంగి నున్న
యాదంపతులఁ జూచి యనియె నుద్ధవుఁడు.
"వేదాంతవిదుఁడైన విష్ణునియందుఁ
బూని మీచిత్తాబ్దములుఁ బెట్టినారు
కాన యెందును బుణ్యకర్మలు మీరు.
కృష్ణ! జనార్దన! కేశవ! శౌరి!
విష్ణు! నారాయణ! వేదాంతవేద్య!
అని తలంచినవారి కఘములు వొలియుఁ
బెనుపార వారలఁ బెంచి పోషింప
మీభాగ్వమహిమకు మితి వేరె కలదె?