పుట:Dvipada-Bagavathamu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

31

తల్లి దండ్రులకును దగునుగ్రసేను
వల్లభునకు మొక్కి వారిజోదరుఁడు
మతిసురాచార్యుఁడై మాన్యుఁడై పొల్పు
నతని నుద్ధవుఁడనుయాదవుఁ జూచి

శ్రీకృష్ణుఁడు ఉద్ధవుని మందకుఁ బుచ్చుట


తనరార మన్నించి తగఁ గౌఁగిలించి
కొని బుజ్జగించి మ్రొక్కుచు సీరి వలికె.
"ఏపార వ్రేపల్లె కేఁగి యానంద
గోపయశోదలఁ గొమరారఁ గాంచి
మక్కువ వారిసేమములెల్ల నడిగి
మ్రొక్కితినను, నేము మొగి తమ్ముఁ జూడ330
వచ్చెదమను, వేగ వసుదేవు దొంటి
యిచ్చటిచుట్టాలు యేమును గలసి
యున్నారమను, మమ్ము నుగ్రసేనుండు
మన్నించునని చెప్పు, మఁదలోఁ గల్గు
గొపాలకుల నెల్లఁగోరి వేర్వేర
నేపార నక్కుననిడినంటి ననుము;
ననుఁ బాసి మదనబాణములలో దారి
ఘనమైన విరహాగ్నిఁ గ్రాఁగుచునున్న
వల్లవసతుల నెవ్వగలెల్లఁ దీర్ప
నెట్లుటిలోన నే నేతెంతుననుము
పొమ్మన్న” నయ్యదుపుంగవుఁ డెలమి
క్రమ్మర రథ మెక్కి కదలి మాపటికిఁ
గర మొప్ప రవికన్యగాతీరభూమి
బొరి గిన్నరేశునిపురి గ్రేణి సేసి