వీటినన్నిటిని విచారించి చూడఁగా మడికి సింగన్న 1430వ సంవత్సరము వఱకైనను జీవించి యుండును. [ఆంధ్ర॥ కవు॥ చరి॥ ప్ర॥ భా॥ 378 పుట].
మడికి సింగనార్యుఁడు 1420కిఁ బూర్వమే భాగవత దశమస్కంధమును రచించినట్లు తెలియుచున్నది. కాఁబట్టి పోతనామాత్యుని భాగవతమునకు ముందుగా రచింపఁబడినది మడికి సింగనార్యుఁని భాగవత దశమస్కంధ మనుటలో సందేహముండదు.
సింగన్న నియోగి బ్రాహ్మణుఁడు భారద్వాజగోత్రుఁడు. అయ్యల మంత్రివరునకును సింగాంబికకును జన్మించినవాఁడు. సింగన్నకృతమగు వాసిష్ఠ రామాయణములోని యీక్రింది పద్యములను గమనింపుడు.
| సీ॥ | “అతండు తిక్కనసోమయాజుల పుత్రుఁడై | |