పుట:Dvipada-Bagavathamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

15

మేను వ్రేయఁగ వేఁగి మిడమిడ మిడికి
గైరికనిర్ఘరకలితాద్రి వోలె
భూరిరక్తంబులఁ బొలిచె నగ్గజము.

శ్రీకృష్ణుఁడు కొల్వుకూటమును బ్రవేశించుట


కరిమదరక్తపంపకములచే మేనఁ
దొరగెడు ఘర్మబిందువులును నరయ
హరిమేను చిత్రవనాంబుద మనఁగ,
నరుదారఁ జూపట్టె నందందఁ జూడ;
గజగంతములుఁ దాను కామపాలుండు
భుజశిఖరంబులఁ బొలుపొందఁ దాల్చి150
దారుణతరదండధరయుగ్మ మనఁగ
గౌరత మల్లరంగము సొచ్చి నిలువ
గోరిమల్లులకెల్ల కులిశమై, ప్రజకు
ధారుణినాథుఁడై, తల్లిదండ్రులకు
బసిబాలుఁడై యొప్పు, పంకజాక్షులకు
నసమాస్త్రుఁడై, వల్లవావళికెల్లఁ
బరమాప్తుఁడై, యతిప్రతతికి నెల్లఁ
బరతత్వమూర్తియై, బంధుసంతతికి
దైవమై, రోహిణీతనయుఁడుఁ దాను
నావిష్ణుఁ డరుదెంచె నండఱుఁ జూడ.
అతులితగంధపుష్పామోదితులును
సతతసౌఖ్వాఢ్యులఁ జారుభూషణుల
శ్రితకీర్తియుతుల, నాశ్రితకల్పతరులఁ
బ్రతిభటవనదావపావకసముల