పుట:Dvipada-Bagavathamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

11

ధూళిలో రొంపిలోఁ ద్రొక్కినయవుడు
కాలుమోవక పాదఖండమై యుంటఁ
చెపులు మూసినయెడ సింధుఘోషంబుఁ
బ్రవిమలంబుగ వినఁబడకుండుటయును
నివియాదిగాఁ బెక్కు లీక్షించి తనకు
యవసానకాల మౌనని యాత్మ నెఱిఁగి
పురపురఁ బొక్కుచుఁ బొగిలి లోగంది
మరణభయంబున మదిఁదప్పెనంత;
నెట్టకేలకు వేఁగ నినుఁడు పూర్వాద్రి
దట్టుఁడై పొడతెంచెఁ దమ్ములింపలర.

కంసుఁడు కొలువుకూటమందు శ్రీకృష్ణబలరాముల రాకను ఎదుఱుచూచుట


అంతఁ గంసుఁడు పూర్వాహ్నికక్రియలు
సంతసంబునఁ దీర్చి సకలభూపతులుఁ
గొలిచియుండఁగఁ బెద్దకొలువుండి వేడ్క
బలరామకృష్ణుల బవరంబుఁ జూడఁ
దలఁచి పెంపెసలారు తమకంబులందు
వలయువారును వసియించెనంత;
మఱియును బహువిధమంచియలందు
వరులు సద్విజరాజవైశ్యశూద్రులను
ప్రవిమలంబుగనుండి, రంగమధ్యమున
వివిధపుష్పసుగంధవిధులు వాసించి110
పరగ నవ్వేళ గోపాలురుఁ దాను
నరుదెంచి నందుండు నాభోజపతికిఁ