పుట:Dvipada-Bagavathamu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ

రమణమహర్షయేనమః

ఉపోద్ఘాతము.

---- — : గ్రంథకర్త - మడికి సింగనార్యుఁడు: —

శ్రీపతియొక్క యెనిమిదియవ యవతారమగు శ్రీకృష్ణ భగవానుని చరిత్ర గలది భాగవతమందు దశమస్కంధము. భాగవతమహాగ్రంధమును దెనుఁగు భాషలో విలసిల్లఁ జేసిన మహాకవి బమ్మెరపోతరాజు. ఈ బమ్మెరపోతనార్యుఁడు హూణశకము 1400 మొదలు 1470 ప్రాంతమందుండినట్లు, ఆంధ్ర కవుల చరిత్రలో శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారు చర్చించి యున్నారు. వాసిష్ఠరామాయణ, పద్మపురాణ, భాగవత దశమస్కంధముల కర్త యగు మడికి సింగనార్యుఁడు హూణశకము 1430వ ప్రాంతము వఱకు నైనను జీవించి యుండవలయునని వారు నిర్ధారించిరి. పోతనార్యుని భోగినీదండకము తన 25వ వత్సరమున అనగా 1425వ సంవత్సరమున విరచించినట్లు తెలియుచున్నది. మడికి సింగనార్యుఁడు పద్మపురాణమును దెనిఁగించి ముగించిన వత్సరము దాని కృత్యంత పద్యమువలన స్పష్టమగుచున్నది.