పుట:Dvipada-Bagavathamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపదభాగవతము

6

మనుజేంద్రునకు నిచ్చి మన్నన వడయఁ
గొనిపోవుచు మ్రోల గోవిందుఁగాంచి
(యసుపమ) భక్తితో నడుగుల కెఱఁగి
తనచేతి చీర ముందటబెట్టి నిలిచి;
యవధరింపుము కృష్ణ! అంభోజనయన!
తవిలి పుణ్యుఁడనైతి ధన్యుఁడనైతి
(నాపద్మ)జాదుల కందగరాని
నీపాదము (లభించె) నిఖలలోకేశ!
మునిలోకనుతపాద! మురవైరికృష్ణ!
(కొనుము యీ పుట్టంబు గోవింద! యనినఁ)50
గని శౌరి కరుణ (సకల కామ్యములును)
తనలోకమును నిచ్చి ధన్యునిఁ జేసె

శ్రీకృష్ణుఁడు సుదాముఁడను పుష్పలావికుని యనుగ్రహించుట


అరుగు దేర సుదాముఁడను పుష్పలావుఁ
డరిగి యెదుర్కొనె నత్యంతభక్తి
బలరామ కృష్ణుల పాదాబ్జములఁ
జెలువారఁ బూజించి చెంగల్వదండ
లిరువురకునునిచ్చి యింపుసొంపార
విరు(లమాలి)కలిచ్చి వెసవేయుగతులఁ
గీర్తింపఁగని హృషీకేశుండు శౌరి
యార్తరక్షణశీలి యతనిమన్నించి
వరము వేడుమటన్న వాఁడు “మీపాద
సరసిజంబులుఁ గొల్చు సద్భక్తి నాకు