పుట:Dvipada-Bagavathamu.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

ద్విపదభాగవతము

మునులు ఋత్విజులునుమురవైరి లావుఁ
గొనియాడి మెచ్చిరి గురుభక్తి నంత
రాజసూయంబుఁ బూర్ణము సేసి ధర్మ
రాజు, పెంపున భగీరథు సుతయందు
నవభృతస్నాతుఁడై యరుదెంచి రాజ
నివహంబుఁ బూజించి నెరవడిఁ గొలిపి
[1]వరదక్షిణల విప్రవరకోటిఁ దనిపి
యావిభవంబున నఖిలబంధులకు
వావిరి నుత్తమవస్తువు లొసఁగి
యనుప! సుయోధనుఁ డా పట్టణమున
నినుపారఁ గొన్నినెలలు వర్తించి
యాసంపదల పెంపు నయ్యధ్వరంబు
నాసభావిభవంబు నాగౌరవంబుఁ
బాంచాలి రూపసౌభాగ్యసంపదలుఁ
గాంచి నిర్విణ్ణుఁడై కడు చిన్నపోయి
యమ్మహీపతిపేర్మి యంతరంగమునఁ
గ్రమ్మర దనవీటి కరిగె రారాజు.660
పొరిఁ బాండవులచేతఁ బూజలు వడసి
హరి ద్వారవతి కేఁగె నతివలుఁ దాను.”
అని చెప్పుటయు కౌరవాధినాయకుఁడు
వినుతుఁడై శుకయోగి విభున కిట్లనియె
“వరమునీశ్వర! నీదువాక్యామృతంబు
గురుభక్తి నెంతఁయు గ్రోలిననైన

  1. ఒకే పాదమున్నది