పుట:Dvipada-Bagavathamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

213

ధర్మరాజు శిశుపాలునకు సమాధాన మిచ్చుట
అనిపల్కుటయు విని యంతకాత్మజుఁడు
“వినవోయి! శిశుపాల! వెఱ్ఱివి గాక
హరికి సమానుఁడు నధికుఁడు గలడె?
ఇరవుఁదప్పినమాట నేటికాడెదవు?
యజ్ఞరక్షకుడును యజ్ఞభోక్తయును
యజ్ఞఫలంబిచ్చు నతఁడును దానె!
అతని తేజోశంబు లఖిలదేవతలు
నతని గాదన నీకు నర్హమే యిట్లు?”
అని పల్క సభ్యులు నతనిఁ గీర్తించి
కనుఁగొని శిశుపాలుఁ గలుషించిరంత.

శిశుపాలవధ


ఆమాటలకు దైత్యుఁ డాత్మసైన్యంబు
తో మహారౌద్రంబుతోఁ బన్నునిలుచె!
కురుబలంబుల నాఁగఁగొనక వే గదిసి
పరవశంబొనరింప పంకజోదరుఁడు
వారల వారించి జ్వలనార్చులొలయ
దారుణచక్ర ముద్ధతఁ బ్రయోగింప
నాదిత్యకుండలాయతతీవ్రమగుచుఁ
జేదిభూపతి శిరచ్ఛేదంబు సేసె.
ఆహారవంబులు నమరసన్నుతులు
నోహోబలంబుల నులివు పె ల్లడర650
నాతని తేజోంశ మందఱుఁ జూడ
నాతతంబుగ వచ్చి హరిలోనఁ గలసె!