పుట:Dvipada-Bagavathamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

211

యాగశాలలు గట్టి యఖిల వస్తువులు
సమకూర్చి వ్యాసాది సంయమీశ్వరులఁ
గ్రమమొప్ప ఋత్విజగణము రావించి
యాగోపకరణంబు లన్నియుఁ దెచ్చి
యాగమోక్తక్రియ నన్ని సంధించి620
దక్షుల నియమించి ధర్మనందనుడు
దీక్షితుఁడై మహాద్విజకోటితోడ
వేలుచుచుండఁగ విష్ణుఁడంతటికిఁ
జాలి భూసురవర్యసమితితో నిలువ
తమ్ములు సకలబాంధవులును దారుఁ
గ్రమ్మర పరిచర్యఁ గావింపుచుండ
హవ్యభాగమునకు నఖిల దేవతలు
దివ్యయానములతో దివినుండి చూడ

యుధిష్ఠిరుఁడు శ్రీకృష్ణున కగ్రపూజ నొసంగుట


నయ్యుధిష్ఠురుఁడు ధౌమ్యాదుల గూడి
చయ్యన నగ్రపూజలు చేయఁగోరి
యందఱ రాజుల నర్థి నీక్షించి
‘ఇందెవ్వరికి నర్ఘ్యమిత్తునో” యనఁగ
సహదేవుఁ డన్నకు జలజాక్షుఁ జూపి
“విహిత మాయర్ఘ్యంబు విష్ణున కిమ్ము
ద్విజుఁడును గురుఁడు ఋత్విజుఁడును భూమి
భుజుఁడు దైవంబునై పొలుపారు నతఁడు!
అతనిఁ బూజించిన నఖిలదేవతలు
పితరులు మునులు సంప్రీతిగావింతు”