పుట:Dvipada-Bagavathamu.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

ద్విపదభాగవతము

నేదసాధ్యములగు నిందిరాధీశ!
మఱఁదులు నీవు నమ్మగధేశు మీఁద
యఱిముఱి నేఁగిన నంతనుండియును
విలసిల్లు నురిగోల వేదనఁ బొందు
పులుగు చందంబునఁ బొరలు చుండితిమి!
చెచ్చెర శత్రునిర్జించి మీరిందు
వచ్చిన ప్రాణంబు వచ్చె గోవింద!”610
అని పల్కుటయు పాండవాగ్రజుఁ జూచి
వినయంబుఁ దోఁప నవ్విష్ణుఁ డిట్లనియె.
“నీయాజ్ఞ తలమోచి నెగడిన మాకు
నాయెడ జయలబ్దులగు టెందు నరుదె?
మూఁడులోకములకు ముల్లైన యట్టి
వాఁడు మగధభూమి వల్లభు నట్టె
వాని నశ్రమమున వధియించె భీముఁ
డేను నాసత్వము నేమనఁగలను!
బెడిదంపు పగదీరెఁ బెంపొంద నీవుఁ
దొడరి యజాతశత్రుఁడవైతి గాన

శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయమునకు గడంగుట


రాజుల రక్షింప రాజసూయంబు
నోజముఁ దప్పక నొనరింపు” మనిన
హరి వాక్యములకుబ్బి యమతనూభవుఁడు
కురుపతి ముఖ్యులఁ గోరి రప్పించి
భాగీరథీతీర పావనస్థలిని