పుట:Dvipada-Bagavathamu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

ద్విపదభాగవతము

ననుపమదివ్యభూషాంబరాభరణు
భీమార్జునసమేతుఁ బృథుదీర్ఘబాహు
కామితార్థప్రదుఁ గడు భక్తి మ్రొక్కి;
“శ్రీనాథ! గోవింద! శ్రీవత్సచిన్హ!
దానవాంతక! కృష్ణ! తామరసాక్ష!
ధారుణి రక్షింప ధర్మంబు నిలుపఁ
గ్రూరదైత్యులఁ ద్రుంపఁ గోరి జన్మించి
యాజనార్దునుఁడ వీవామ్నాయరూప!
ఈ జరాసంధుచే నీబాధనొంది
నునికియు నిది మహదుపకారమయ్య!
ఘనయోగవర్యులు గానఁగలేని
[1]నినుఁజూడఁ గంటిమి నిఖిలాండ నిలయ!590
తలఁపులుఁ దనువులు దయనిచ్చితీవు
జలజాక్ష! ఇది పునర్జన్మంబు మాకు!
ఖలు జరాసంధు నొక్కట జీరివైచి
బలియుఁడై పేర్చెనీ బకవైరి లావు!”
అని దీనవదనులై యర్థి కీర్తించు
జననాయకులఁ గృపాజలరాశిఁ దేల్చి
జలజాక్షుఁడంత మజ్జనభోజనముల
నలరించి భూషాంబరాదు లర్పించి
వారల నూరార్చి వలనొప్పఁ బలికె.
“క్రూరాత్ము చరసాలఁ గుంది లోఁగంది
ముచ్చట నున్నారు; మొగిరాజ్య లీల

  1. ఒకే పాదమున్నది