పుట:Dvipada-Bagavathamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

207

జేయార్చి రెండుగాఁ జీరి నవ్వుటయు
నాసన్న దెలిచి మహాబలాత్మజుఁడు
ఆసన్నుఁడగు శత్రు నంటంగఁ బట్టి
పడవైచి కడకాలుఁ బరుసనఁ ద్రొక్కి
వెడవెడ నార్చుచుఁ బ్రిదిలి పోనీక
నటమున్ను జరచేత నంటంగబడిన
చటులాత్ముఁడగు జరాసంధుని మేను
తరమిడి కదిళికాస్తంభంబుఁ జీరు
కరిఁబోలి నుగ్రభీకర లీలఁ జీరి
యిరుపక్కలుగఁ జేసి యిరువంక వైచి
పరువడి నార్చిన పవమానసుతుని
హరియును నర్జునుఁ డందంద పొగడ
సురసమూహము ప్రీతిఁ జూచి కీర్తించె.

శ్రీకృష్ణుఁడు జరాసంధుని కుమాఁరుడు సహదేవుని రాజ్యమం దునిచి, కారాగృహవాసులగు రాజులను విడిచిపుచ్చుట


హరియు జరాసంధియగు సహదేవుఁ
బరగ మగధరాజ్య పట్టంబుఁ గట్టి;580
యఱిముఱిఁ జరసాల యందున్న నృపుల
వెఱవాపిఁ యందఱ విడిచి పుత్తెంచె.
కారాగృహంబునఁ గడుమాసి సొచ్చి
క్రూరబాధలఁ గంది కుందుచునున్న
యిరువదివేవురు నెనమన్నూటాఱ్వు
రురుచయ భ్రాంతులై యొండొండ వెడలి
చనుదెంచి కనిరి వాసవలోకవంద్యు