పుట:Dvipada-Bagavathamu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

ద్విపదభాగవతము

బూని యందఱఁ బ్రేమఁబూజించి కుంతి
పాంచాలసుతయు సుభద్రయుఁ గృష్ణుఁ
గాంచి సాష్టాంగంబు కరమర్థి నెఱఁగి
హరి కాంతలును దాను నన్యోన్య ప్రేమ
బరిరంభణముల సంభావన క్రియల
సలిపి యింపార మజ్జనభోజనములఁ
గలసి క్రీడించిరి; కమలాక్షుఁడంత
నాపాండవుల సేమమంతయు నడిగి
యాపార్థు గృహమున కరుగ నన్నరుఁడు
మజ్జనభోజన మహిత సౌఖ్యముల
నజ్జగన్నాథుని నతిభక్తిఁ దనిపి500
హంసతూలిక పాన్పునందు సంప్రీతిఁ
గంసారి నునిచి కాల్గడనుండి క్రీడ
నడుగు లొత్తుచు నుచితాలాప లీలఁ
గడఁగి వినోదింపగా ధర్మసుతుఁడు
చనుదెంచుటయు శౌరి చయ్యన లేచి
తనర నానృపు కరస్థలిబట్టి తివియ
నేక శయ్యను వారలిరువురు నుండఁ
జేకొని తమ్ములు సేవించియుండ
“నారగించితే కృష్ణ! అలసితీ” వనుచు

ధర్మరాజు రాజసూయయాగ విషయమై శ్రీకృష్ణుని యెదుట ప్రస్తావించుట


శౌరితోడ నజాతశత్రుఁ డిట్లనియె.
“లోకబాంధవ! చంద్రలోచన! భక్త