పుట:Dvipada-Bagavathamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

ద్విపదభాగవతము

చనుదెంచె దివినుండి శౌరిసన్నిధికి.
అమ్ముని కెదురేఁగి యర్హపీఠమున
నిమ్ముల నిలిపి మోమీక్షించి పలికె.
“మునినాథ! త్రిభువనంబుల వార్తలెల్ల
ఘనదివ్యదృష్ఠిని గననివిలేవు!450
ఏమి విశేషంబు లెఱిగింపు” మనిన
ఆముని నవ్వుచు హరిఁ జూచి పలికె.
“నీమహత్వంబున నిఖిలంబుఁగాంతు
నీమాయకడఁగాన నేరకున్నాఁడ!
కోరి నీ మేనత్తకొడుకు ధర్మజుఁడు
సూరివంద్యుఁడు రాజసూయాధ్వరంబుఁ
జేయనుద్యోగించి చెచ్చెర నిన్ను
శ్రీయుక్తి నాచార్యుఁ జేయనున్నాఁడు!
ఆమఘంబీక్షింప నఖిలదేవతలు
భూమీశ్వరులు వేడ్కఁ బోవుచున్నారు
నీరజాయతనేత్ర నీవువిచ్చేసి
బోరున రిపుకోటిఁ బొరిమార్చు వేగ
నచ్చట, శిశుపాలు డడరి నీచేత
జచ్చు నీపయనంబు సమకూర్పవలయు;
పొరి జరాసంధుఁ నుబొరిమార్ప నెట్టి
వీరున కెందును వెరవుగాదెందు!
అతఁడు భీమునిచేత నట మల్లయుద్ధ
హతుఁడౌను యన్యుల కతఁడజేయుండు.
భీమునిచేతను బెరపెట్టి చంపు
నే మీకు నెఱిఁగింప నేతెంచినాఁడఁ460