పుట:Dvipada-Bagavathamu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

191

“నారదు వీడ్కొల్పి నలినాక్షుఁడంత
నారులు దాను నున్నత కేళిసలుపఁ
గమలారి యామినీకన్యకఁ బ్రీతిఁ
గ్రమమొప్పఁ బెండ్లికి గానేఁగుదేర

సాయంకాల వర్ణనము


చరమాద్రి యను కలశము నీటిలోన
గురువెట్టిన ఘడియకుడుకయో యనఁగ!
పరపైన ద్విజవాక్యఫణతులు చెలఁగఁ
గరమొప్పఁ గ్రుంకె భాస్కరమండలంబు;
ఎఱసంజ యడరి కెంపెక్కె నంబరము;
తఱితఱిఁ బొడఁజూపెఁ దార లందంద,
ఆలోన సకలదిశాక్రాంత మగుచు
మేలైన కృష్ణుని మేచాయఁ బోలె
నెఱినొప్పఁ గాళింది నీరంబువోలె
తఱచైన తేఁటుల దాటుఁల వోలె
పెనుపైన నీలాల పేరులు వోలె
ఘనమైన యేనుఁగ కదువులు వోలె
నలినొప్పు నీలోత్పలంబులు వోలెఁ
బొలుపైన కస్తూరి ప్రోగులు వోలెఁ400
దొలుకారుకాంతులు తుఱుములు వోలెఁ
దలమీరి చీఁకటి దట్టమై పేర్చి
ఘనతమోవారణగర్వంబు లణపఁ
గొనకొన్న సింగంపు కొదమకో యనఁగ
రాకావధూమణి రాగిల్లి చూచు