పుట:Dvipada-Bagavathamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

187

గేళిమై నింతులు కెలఁకులఁ గొలువ;
మండితకోటీరమణికాంతి నిగుడ
కుండలరుచులు జెక్కుల నవ్వులొలయఁ;
చెనకి కౌస్తుభమణి శ్రీవత్సరుచుల
వనమాల యురమున వాసనఁ జూప;
ఆయత శంఖచక్రాది చిహ్నములఁ
గేయూరకంకణాంకితబాహు లొలయ;
హాటకరుచిరచేలాంచలద్యుతులఁ
బాటిల్లి బాలాతపస్ఫూర్తి నిగుడ,
తెల్లదామెరమీఁది తేఁటి చందమున
నల్లనిమేను నున్నతశయ్యఁ జేర్చి
[1]సుదతులతోఁ గూడి సుఖగోష్ఠినున్న
యారూఢయౌవను నంభోజనయను
నారాయణుని సచ్చిదానందుఁగాంచి
మఱుఁగున నిలుచుండి మహతి మీటుటయు;
నెఱిఁగి దిగ్గనలేచి యెదురేఁగి మ్రొక్కి350
యమ్మునిఁ దోతెంచి యర్థిఁ బూజించి
క్రమ్మన నెమ్మోముఁ గనుఁగొని పలికె.
“ఓమునీశ్వరచంద్ర! యోగీంద్రవంద్య!
సేమమేనీకు? నీశిష్యులు సుఖులె?
మామీదగృపఁగల్గి మమ్ము మన్నించి
యేమివిచ్చేసితి రెఱిగింపు” మనిన
నల్లననవ్వుచు హరికేలుపాణి
పల్లవంబులఁబట్టి పలికె నమ్మౌని.

  1. ఒకే పాదమున్నది