వెలలేని ఈపద్యరత్నము నెంతకొనియాడినను దనివి తీరనిది. కాని స్థానము చెడి శోభింప లేకున్నది. దూత్యముఁ జేయబోయిన బ్రాహ్మణుఁడిట్లు వర్ణించుట సందర్భోచితము కాఁజాలదు. ఈ సందర్భమునందు సింగనార్యుని రచనయే స్వాభావికమై యింపును గూర్చినదిగా నున్నది.
సౌధవర్ణన, ఋతువర్ణన, యుద్ధవర్ణన మొదలగునవి కవి చాలా చోట్ల చేసియున్నాఁడు. ప్రబంధములలో విసుగు పుట్టించు ఘట్టములిట్టి వర్ణనాడంబరములే యగును. అయినను జతురుఁడగు నీ కవి పాఠకుల కా భాగము లందు వినోదమునే కలిగించి చరితార్థుఁడయ్యెను. మచ్చునకు కొన్ని యెత్తి చూపించుచున్నాను.
పురస్త్రీలు శ్రీకృష్ణబలరాములను జూచి వారిలో వారు మాట్లాడుకొనుటను దిలకింపుడు.
| | “ఈతఁడే, ఎలనాగ! ఇసుమంత నాఁడు | |