పుట:Dvipada-Bagavathamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

ద్విపదభాగవతము

నతిసంభ్రమంబున నందఱుఁగూడి
యతని సన్నిధికేఁగి యర్ధిఁబూజించి
సేమంబులడిగి యాసీరి నీక్షించి
“యేమివిచ్చేసితి రెఱిఁగింపుఁ”డనిన
ధార్తరాష్ట్రులును బాంధవులును వినఁగ
నార్తరక్షణశీలి హలపాణి పలికె.
“కోరి మామేనత్త కొడుకులు మీరు.
ఆరూఢి మీకు మేనల్లుఁడుగానఁ
దన మేనమఱఁదలి దరళాయతాక్షిఁ
జనవునఁ గొనిపోయె సాంబుఁడు దీనఁ
గలఁగి విరోధింపు టర్హంబుగాదు
వెలఁదితో నాతని విడిచి తెం”డనిన.
అల్లన నవ్వుచు నాసుయోధనుఁడు
ప్రల్లదంబున బలభద్రుతో ననియె.290

హేళనచేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి హస్తినాపురిని నాగలిమొనచే లేవనెత్తుట


 “అకట! గురుస్థానమని నిన్నుఁజూడ
మెకమెకపడు మందమేళముల్ తగునె?
[1]ఒకనిఁ గొల్చిన వార లుర్విలో మీరు!
ఆదిగర్భేశ్వరు లగు కౌరవులకు
యాదవులకు వియ్యమందంగఁ దగునె?
మిమ్మేలురాజును మీరును నాకు

  1. ఒకే పాదమున్నది