పుట:Dvipada-Bagavathamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

179

దివిజసంఘము రాము దీవించిరంత250
నలిన నేత్రుండున్న నగరికేతెంచి
హలి కృష్ణుతోడ నయ్యగచరు వార్త
వినుపింప శౌరియు వివిధ బాంధవులు
వినుతు లొనర్చిరి వెసరామునంత

సాంబుఁడు దుర్యోధనుని కుమార్తె లక్షణ నపహరించుట


అంబుజోదరపుత్రుఁ డతిరథోత్తముఁడు
జాంబవతేయుండు సాంబుఁడు ఘనుఁడు
కోరి ధుర్యోధను గూఁతు లక్షణను
వారణవురి స్వయంవరమునందునను
వరియించి కొనిపోవ వారలందఱును
గురుపతి కెఱిఁగింపఁ గోపించి యతఁడు
“ఏమేమిరా! సాంబుఁడే నాతనూజ
నేమని కొనిపోయె నెట్లు జూచితిరి?
కురువంశజులతోడఁ గూడి యాదవులు
పరిణయప్రాప్తులే పరికించి చూడ?
పడుచువాఁడీకన్య బలిమిఁ గొంపోవఁ
దడయకఁ జూచుట తగవుగా దతని
బట్టి తెత్త” మటంచు బలములతోడ
దట్టుఁడై వడి సుయోధనుఁ డుగ్రవృత్తి
వెడలి యార్పుచుఁ దాఁకి విష్ణునందనుని
దడయక శస్త్రాస్త్రతతుల నొప్పింపఁ260
గనిపోయి తిరిగి యగ్గలికమై వేఁచి
తన రథంబఖిలవర్తనలఁ గ్రీడింపఁ