పుట:Dvipada-Bagavathamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జగదభిరక్షకాండము

175

మఱలె బిట్టొఱలుచు మది విహ్వలింప
పఱగంగ నయ్యెదు ప్రవరసాధనము
యఱిముఱి వెనుకొన నదికాశిఁ జొచ్చె.
చొచ్చిన నిట్టట్టు సురగంగ నీక
నచ్చక్ర మడరి ఘోరానలశిఖల
నాఋత్విజులతోడ నాకృత్తితోడ
నారాజుతోడ జనావళితోడ
ఘనశతాంగక వాజి గజశాలతోడ
ధనధాన్య వస్తు సంతానంబుతోడఁ
[1]బొలుపారుసౌధగోపురములతోడఁ
గాశీపురము చక్కుగాఁ జేసి కాల్చి
యీశేషి హరి పాలికేతెంచి మ్రొక్కె.
నీకథావర్ణన మెల్ల వారలకు210
ప్రాకటకృత్యముల్ బాధలు నడఁగు
పుత్రసంపదలును భోగసంపదలు
శత్రుక్షయంబు మోక్షము నిచ్చుచుండు.”
అనిచెప్పుటయువిని యభిమన్యసుతుఁడు
వినతుఁడై శుకయోగివిభున కిట్లనియె.
“ఆ మందలో నుండి యరుదెంచి యచట
కామపాలుండేమిగతి విశ్రమించె?
ఆతని చరితంబు ననిశంబు వినఁగఁ
గౌతుకంబయ్యె నాకథఁ జెప్పు” మనిన

  1. ఒకే పాదము కన్పట్టుచున్నది.