పుట:Dvipada-Bagavathamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

ద్విపదభాగవతము

బహుభూతఢాకినీప్రతితోడ వచ్చి
దహనార్చు లొలయ నాద్వారకఁ జొరఁగ
కారగ్ని దరికొన్న ఘనసత్వచయము
పారెడుగతి జనప్రతతి రేఁపఱచి
యతివలతో జూదమాడుచు నున్న
శతదళాయతనేత్రు సన్నిధి నిల్చి
“ఇదె యొక్క కృత్తి యహీనాగ్ని శిఖలఁ
గదిసి పట్టణమెల్లఁ గాల్చుచు వచ్చె
నిక్కడ దిక్కులేదీబారిఁ గడపి
గ్రక్కున మమ్ములఁ గావవే కృష్ణ!”
అని యార్తులై పలుక నాపౌరజనులఁ
గనికేల వారించి కడకంట నగుచు
యది మహేశ్వరకృతియౌ కృత్తి యగుట
మదిలోన నెఱిఁగి సౌమ్యజ్ఞాన విభుఁడు;

శ్రీకృష్ణుఁడు సుదర్శనమును గృత్తిపై పనుచుట


తనుకొల్చియున్న సుదర్శన పురుషుఁ
గని నల్ల నవ్వుచు కనుసన్నఁ బనుప
నమ్మహాచక్రంబు హరి యాజ్ఞఁ బూని
క్రమ్మన నేతెంచి కాలాగ్ని వోలె200
శతయోజనోత్తాల చటుల విగ్రహము
శతభుజసమదోగ్రశస్త్రాస్త్రములును
ఘనసహస్రార్కనిర్గత తీవ్రరుచులఁ
బెనుమంటలెగయ నాభీలమై పేర్చి
హరి చక్రమేతెంచు టాలించి కృత్తి