పుట:Dvipada-Bagavathamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

ద్విపదభాగవతము

గనకాంబరంబును గరుడకేతనము
మకరకుండలములు మణికిరీటంబుఁ
బ్రకటంబగుజలసత్ప్రసవమాలికయు
నివినాకు వేవేగ నిచ్చి ప్రాణముల
సవరించుకొని నన్ను శరణంబుఁ జొరుము;150
కాదేని నాతోడ కదనంబు సేయ
నాదటఁ బేర్చి ర”మ్మ ని చెప్పె” ననుఁడు;
విని జనులందఱు వికవిక నగఁగ
ఘనుఁడు కృష్ణుఁడు వానిఁ గనుగొని పలికె.
“కండ క్రొవ్వున గన్ను గానకఁ బెక్కు
దుండగంబులు ప్రేలి త్రుళ్ళుగాకేమి!
భండనభూమిలోఁ బరిమార్చి వాని
కండలు భేతాళగణముల కిత్తు,”
అని పల్కి దూతకు నర్ఘ్యవస్తువులఁ
దనిపి వీడ్కోలుప పౌండ్రునితోడ
హరి వాక్యములు జెప్ప నతఁడు కోపించి
దురమున కేతెంచె దోర్గర్వ మెసఁగ.

పౌండ్రకుఁడు హరినిఁ దాఁకుట


బహుదళంబులతోడఁ బౌండ్రుఁ డేతేర
నహిమాంశు సమతేజుఁడగు వెన్నుఁడెఱిఁగి
పరఁగు సారథ్యదర్పంబు మెఱయఁగ
దేరెక్కి శస్త్రాస్త్రదీప్తులు నొలయఁ
బాంచజన్యధ్వని పరిపంథి సేనఁ
జంచలించఁగ వచ్చు శౌరిపై నడరి