పుట:Dvipada-Bagavathamu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

ద్విపదభాగవతము

కడువేగఁజెప్ప నక్కడికేఁగుదెంచి
కూపగతంబైన కృకలాసకంబు
శ్రీపతి వీక్షించి చేతను దివియ
నది దివ్యపురుషుఁడై నంబుజోదరుని
పదపంకజములకు భక్తి మ్రొక్కుటయు
హరిజూచి పలికె “పుణ్యాత్మ! నీకిట్టి
సరటజన్మం బేల సమకూరె?” అనుఁడు10
“అనఘాత్మ! నృగుఁడ నిక్ష్వాకువంశజుఁడ
బెనుపడ సంపదఁబేర్చినవాఁడఁ
దారకంబులు వృష్టిధారలు నిసుక
వారాసితరగలు వడినెన్న వచ్చు
గాని నే విప్రసంఘములకు నిచ్చు
ధేనుసంఖ్యలు గణతింపఁగఁజాల
నొకపుణ్యదినమున నొకవిప్రవరున
కొకగోవునిచ్చిన యురక యాకుఱ్ఱి
క్రమ్మర నామంద గలసిన నెఱుఁగ
కమ్మొద వొక బ్రాహ్మణాఢ్యుని కొసఁగ
మును ధారకొన్న యాముసలి బ్రాహ్మణుఁడు
తనకుఱ్ఱి తప్పినఁ దడవుచు వచ్చి
యావిప్రునింటిలో నేపారుచున్న
గోవును గొనిపట్టుకొనిపోవ నాపి
“యేమి కాఱులు చెప్పెదీకుఱ్ఱి నాకు
భూమీశ్వరుఁడు ధారపోసినవాఁడు
రాజుచే మును పరిగ్రహముఁగన్నాఁడ
యీజగంబెఱుఁగు నా యిది కుఱ్ఱియగుట