Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తనరు గచ్ఛప నిధిద్వయ మింతి పాద
వనజాతముల మీఁద వ్రాలెనో యనఁగ;
గమనజాడ్యము శుభాకరమును నగుచుఁ
గమనీయలీల మీఁగాళ్లొప్పు సతికి;
పగడంపుఁ దీగల పంక్తులో యనఁగ
మగువకు నొప్పారు మడిమల తీరు;
 …………………………………. ”

(ద్వి॥భా॥పుట72)

విష్ణుశక్తియగు రుక్మిణీదేవి వర్ణనము శ్రీకృష్ణుని వద్దకు దూతగా వెళ్ళిన బ్రాహ్మణుని నోట నుండి వచ్చునప్పుడు చితజ్ఞుఁడగు కవి చూపిన మర్యాదను, బ్రాహ్మణుఁడు రుక్మిణీదేవి యొక్క యభిప్రాయమును రసికాగ్రేశరుఁడగు శ్రీకృష్ణుని యెదుట ప్రతిపాదించిన నేర్పును గమనింపుడు.

ద్వి॥

“అనఘాత్మ! భీష్మకుండను విదర్ఛేశు
తనయ రుక్మిణి యను ధవళతాక్షి
తనుమధ్య యుత్పుల్ల తామరసాక్షి
గరుడ కిన్నర యక్ష గంధర్వ సతులు
దొరయలేరా యింతితో నీడుఁబోల్ప;
దేవర సౌభాగ్య దివ్యవర్తనలు
వావిరి జను లెల్ల వర్ణింపుచుండ
విని పుష్పధన్వుని విషమబాణములు
యనవొందఁ దనువున నట నాటుటయును
జిత్తంబులో నీదు చెలువైన మూర్తి
చిత్తరు వొత్తిన చెలువంబుఁ దోఁపఁ
జింతించు వెఱఁగందు చేష్టలు మఱచు