పుట:Dvipada-Bagavathamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

121

ఇంద్రుఁడు శ్రీకృష్ణునితో యుద్ధముఁ జేయుట


అనలకృతాంత దైత్యాధీశవరుణ
యనిలకుబేర భూతాధీశవరులు
తమ వాహనముల నుద్ధతి నెక్కి పేర్చి
కమలాక్షుఁ దాఁకిరి కరముగ్రవృత్తి;
నార్పుల బొబ్బల నట్టహాసముల
దర్పించి కవిసి నాదనుజారి మీద
వ్రేసియుఁ బొడిచియు వివిధ బాణముల
నేసియు నొప్పింప నిందిరావిభుఁడు
పారిజాతముతోడఁ బక్షీంద్రు తోడ
వారిజాననుతోడ వరశక్తి దిరిగి
పటుశార్ఙ నిర్ముక్త బాణజాలముల
చటులతఁ జూపి నిర్జరసేనఁ బఱపి
యమరాధిపతి నొంచి యనలుఁజల్లార్చి
సమవర్తి గెలిచి రాక్షసుని నిర్జించి
వరుణ బీరము మాన్పి వాయువుఁ బఱవ
నరవాహు గెలిచి పినాకి సృక్కించి650
బృందారకశ్రేణిఁ బెఱికి యందంద
యందఱి గెలిచి తా(రేఁ)గె ద్వారకకు.
పారిజాతము సత్యభామ గేహమున
నారూఢగతి నిల్పి యతి సౌఖ్యమైన
శుభముహూర్తమున భూసురులు దీవింప
నభినుతులొనరింప నంబుజోదరుఁడు
పదియాఱువేలరు పంకజాననల
వదలని వేడ్క వివాహమై వేర్చి