పుట:Dvipada-Bagavathamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కల్యాణకాండము

115

హరి నందకంబెత్తి యమ్మురాసురుని
కరమును గదయును ఖండించివైచె.
యాదవోత్తముఁడు చక్రాభీలధార
నైదు శిరంబుల నవలీలఁ దునుమ
బలభేదిచేఁ గూలు పర్వతం బనఁగ
నలవరి మురదైత్యుఁ డవనిపైఁ గూలె.

మురాసురుని పుత్రులు తామ్రాదుల యుద్ధము


ఆమురాసుర పుత్రులైన తామ్రాదు
లాముకుందుని మీఁద నందంద కవిసి
కరవాలముసలముద్గరభిండివాల
పరశుతోమరగదాపాశశక్తులను580
బలములుఁ దారును బాణజాలముల
బలువిడి గురియించి పక్షీంద్రుమేను
హరిమేను నొ(ప్పింప హరియుఁ గోపించి)
కరములఁ ద్రెవ్వి యంగంబులఁ దునిమి
బరులు వ్రక్కలు వాపి పథములు మురిసి
శిరములు.................పగిలి
యెమ్ములు చిద్రుపలై యెఱచులు చదిపి
యమ్ములు పొడిపొడియై జోళ్లు విఱిచి
కరుల.............................
..................రవరలై ధాత్రి దొరగె
నందంద మేనులు నన్నిచందములఁ
జిందువందై హతశేషులు వఱవ