పుట:Dvipada-Bagavathamu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

ద్విపదభాగవతము

వనితఁదోడ్కొని వచ్చె ద్వారకాపురికి.
 

సత్యాపరిణయము


అగ్నిజిత్తుండను నా రాజుతనయ
నగ్నిజిత్తాఖ్య నాయబ్జలోచనుఁడు
కడు వేడ్కతోఁ బెండ్లిగానిచ్చఁగోరి
కడఁకఁ గోసలపతికడకేఁగె నతఁడు.520
కొనకొని హరి నెదుర్కొని తోడుకొనుచుఁ
జని యిష్టపూజల సంప్రీతుఁజేసి
“కారుణ్య గుణపూర్ణ! కల్యాణశీల
వారిజోదర! లోకవంద్య! శ్రీకృష్ణ!
నా యింటి కరుదెంచి నన్ను మన్నించి
తే, యుగంబులయందు నేఁ గృతార్థుండ
నేమి విచ్చేసితి రెరిగింపు”మనినఁ
దామరసాక్షుఁడాతనికిట్లు జెప్పె.
“నీ కూఁతు సత్య నున్నిద్రాంబుజాక్షి
మాకు ని”మ్మనిన నమ్మనుజేంద్రుఁ డనియె.
“హరి! నీవు మా యింటి యల్లుండవౌట
పరమ కౌతుకము మా బంధులకెల్ల
నీ పట్టణంబున నేడు శాశ్వతము
నేపారు నురు వృషభేంద్రంబు లిట్లు
శాతశృంగోత్తుంగ చటుల సత్వమున
భూతలాధీశులఁ బొలియించుచుండు
వాని నేడింటిని వసుధపైఁ గూల్చు
వానికిఁగాని యీ వనిత నీననుచు