పుట:Dvipada-Bagavathamu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

ద్విపదభాగవతము

ధర్మనందను గేలు తనకేలఁ బట్టి
యర్మిలి నిగుడ నిట్లనియె నాశౌరి,

శ్రీకృష్ణుఁడు పాండవుల క్షేమవార్తల నరయుట


“అక్కటా! దుర్మదులగు శత్రుజనులు
పెక్కు పాటుల మిమ్ముఁ బెట్టంగ వినుచు
నొప్పగించిన యట్టులుంటిమి గాని
యప్పటప్పటికి మిమ్మరయంగ లేక
దైవంబుకతన నింతటి బాధలుడిగె
నేవిధంబునఁ బుణ్యులీలోకములును;”
అనవుఁడు ధర్మరాజా కృష్ణుఁ జూచి
వినయ బాంధవములు వెలయనిట్లనియె.
“అనఘాత్మ! నీ మర్మమరయక యున్న
మననేర్తుమే మేము మర్త్యులలోన?
తల్లియుఁ దండ్రియుఁ దైవంబు గురుఁడు
నెల్ల బాంధవులును నిల నీవె మాకు!
ఈ కొద్ది వాక్కేల నిహపరంబులకు
మాకెవ్వరున్నారు? మధుకైటభారి!”
అనుచు మజ్జన భోజనాది సత్కార
వినయోపచారాది విధులఁ బూజింప480
హరియుఁ బాండవులును నన్యోన్య మైత్రి
నురుతరంబుగ నుండ నొకయేఁడు చనియె.

శ్రీకృష్ణుఁడును బార్ధుఁడును వేఁటకై వెడలుట


అత్తరి నొకనాఁడు హరియుఁ బార్ధుఁడును